ఆ ఉద్యోగానికి రోజు జీతం రూ.48 కోట్లు!

ప్రపంచంలోనే హయ్యెస్ట్ శాలరీ అందుకుంటున్న వ్యక్తిగా భారత్ కు చెందిన జగదీప్ సింగ్ రికార్డు నెలకొల్పారు. జగదీప్ సింగ్ ఏకంగా ఏడాదికి రూ.17,500 కోట్ల వేతనం అంటే రోజుకు రూ.48 కోట్లు చొప్పున అందుకుంటున్నారట. ఇంతకీ జగదీప్ సింగ్ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు.. ఆ ఉద్యోగానికి ఎందుకంత డిమాండ్ వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన ‘క్వాంటమ్‌స్కేప్’ (Quantumscape) కంపెనీకి జగదీప్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. 2010 నుంచి సేవలందిస్తున్న ఈ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే సాలిడ్ స్టేట్ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఈ బ్యాటరీలు సాంప్రదాయ లిథియం – అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వేగంగా ఛార్జ్ అవ్వటంతో పాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్ అలానే మెరుగైన భద్రతను అందిస్తున్నాయి. క్లీన్ ఎనర్జీ రివల్యూషన్‌ దిశగా సాగుతున్న పరిశోధనల్లో ఈ సంస్థ ముందంజలో కొనసాతుండటంతో బిల్ గేట్స్, వోక్స్ వ్యాగస్ వంటి దిగ్గజాలు పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఫిబ్రవరి 16న ‘క్వాంటమ్‌స్కేప్’సంస్థకు CEOగా రాజీనామా చేసిన జగ్దీప్‌ సింగ్‌ ఆ బాధ్యతలను శివ శివరామ్‌కు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *